'సరిలేరు నీకెవ్వరు' విషయంలో అది పుకారు మాత్రమేనట!

  • ముగింపు దశలో 'సరిలేరు నీకెవ్వరు'
  • వంశీ పైడిపల్లి సూచనలు కోరిన మహేశ్
  • జనవరి 12వ తేదీన భారీ విడుదల
మహేశ్ బాబు - అనిల్ రావిపూడి కాంబినేషన్లో 'సరిలేరు నీకెవ్వరు' సినిమా రూపొందుతోంది. చిత్రీకరణ పరంగా ఈ సినిమా ముగింపు దశకి చేరుకుంది. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను, సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన విడుదల చేయనున్నారు.

ఈ నేపథ్యంలో .. ఈ సినిమా షూటింగు పార్టు పూర్తికాగానే, మహేశ్ బాబు .. దర్శకుడు వంశీ పైడిపల్లిని రంగంలోకి దింపుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. వంశీ పైడిపల్లితో గల సాన్నిహిత్యం కారణంగా .. ఆయన విజన్ పై గల నమ్మకంతో, ఈ సినిమాకి తుది మెరుగులు దిద్దే బాధ్యతను ఆయనకి మహేశ్ బాబు అప్పగించాడనే ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదనేది తాజా సమాచారం. ఈ సినిమా అవుట్ పుట్ చూసి, సూచనలు .. సలహాలు మాత్రమే ఇవ్వమని వంశీ పైడిపల్లిని మహేశ్ బాబు అడిగాడట. పూర్తి బాధ్యతను ఆయన అనిల్ రావిపూడిపైనే పెట్టాడని అంటున్నారు.
Go Back to Shorts
Mahesh Babu
Rashmika
Vijaya shanthi

More Telugu News